in ,

Shruti Haasan fires on celebs holidaying during pandemic!

మధ్యకాలంలో చాలా మంది తారలు హాలిడే ట్రిప్ లకు వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఇదే అంశాన్ని తప్పుబడుతూ నటి శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..విహారయాత్రలకు వెళ్లే హక్కు, డబ్బు వాళ్లకు ఉన్నప్పటికీ.. ఇలాంటి సమయంలో అలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది శృతి. కరోనాతో పోరాడుతున్న కొంతమంది వ్యక్తులకు ఇది చాలా కఠినమైన సమయమని..ఇలాంటి సమయంలో కొంతమంది తారలు విహారయాత్రలకు వెళ్లడం కరెక్ట్ కాదంటూ విమర్శలు చేసింది.

ప్రజల మనోభావాలను గుర్తించాలని.. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీలు చేసుకోవడం, ట్రిప్ లకు వెళ్లడం మంచిది కాదన్న శృతి.. తనవంతుగా ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి సమాచారాన్నైనా. షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం సెలబ్రిటీలంతా మాల్దీవులకు ట్రిప్ కు వెళ్లి అక్కడ సేద తీరారు. అయితే కరోనా సెకండ్ వేవ్ మొదలైన తరువాత కూడా కొంతమంది తారలు వెకేషన్ కి వెళ్తున్నారు. రణబీర్, అలియా, జాన్వీ కపూర్, దిశా పటానీ లాంటి తారలు ట్రిప్ కి వెళ్లడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు..

balayya’s ‘Akhanda’ digital and satellite rights sold for biggest price!

Colors Swathi making comeback with ‘Panchathantram’!