
రష్మిక మందన్న ఇటీవల తుంటి గాయానికి గురై ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఊహించని విరామం వృత్తిపరమైన పని, వ్యక్తిగత జీవితంపై తన దృక్పథాన్ని ఎలా మార్చిందో ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఒకప్పుడు విరామం లేకుండా నిరంతరం పనిచేయడాన్ని ఇష్టపడిన తనకు, ప్రస్తుతం ఆ ఆలోచనే ఆందోళన కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రష్మిక ఒక ఆసక్తికర పోస్ట్ను పంచుకున్నారు.
“క్షణం తీరిక లేకుండా నిరంతరం పనిచేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా వేగాన్ని తగ్గించడం భయంగా అనిపిస్తుంది. కానీ, అనుకోని పరిస్థితుల వల్ల నెమ్మదించాల్సి వచ్చినప్పుడు, గతంలో చేసిన ఆ తీవ్రమైన శ్రమ హస్లింగ్ ఇప్పుడు భయాన్ని కలిగిస్తోంది. బహుశా ఇదే జీవితం కావచ్చు” అని రష్మిక రాసుకొచ్చారు. తన కుటుంబ సభ్యులతో గడుపుతున్న కొన్ని ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. తాను ప్రస్తుతం ప్రేమ, సానుకూలత, ప్రార్థనల మధ్య ఉన్నానని చెబుతూ, అభిమానుల ఆదరాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు..!!

