in

kiara advani about her early struggles!

బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో కియారా అద్వానీ ఒకరు. ఈమె వరుసగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ మరియు గుడ్ న్యూస్ లాంటి చిత్రాలు సక్సెస్ ఇవ్వడం మరియు లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ తో మంచి స్టార్ డం రావడంతో బాలీవుడ్ లో ఈమె టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా సొంత కష్టంతో అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా నిలిచిన కియారా అద్వానీ ప్రస్తుతం లక్ష్మీ బాంబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కియారా అద్వానీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

నేను సినిమాల్లోకి వచ్చే వరకు నాకు ఇండస్ట్రీలో తెలిసిన వారు ఉన్నారనే విషయం తెలియదు. సయిద్ జాఫ్రీ.. అశోక్ కుమార్ లు నా ఫ్యామిలీకి చెందిన వారనే విషయం నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో నేను ఎప్పుడు ఎదగాలని కోరుకోలేదు. కెరీర్ ఆరంభం నుండి చాలా కష్టాలు పడుతూ ఆఫర్లు దక్కించుకున్నాను. సినిమా ఛాన్స్ ల కోసం చాలా ఆఫీస్ ల చుట్టు తిరిగానంటూ చెప్పుకొచ్చింది.

Allu Arjun’s Sarrainodu has created a unique record.

top 10 Tollywood celebrities who passed away tragically young!