in

Director Teja Announces Sequel To ‘Chitram’ Movie!

చిత్రం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు తేజ. తక్కువ బడ్జెట్ తో ఉదయ్ కుమార్, రీమాసేన్ , చిత్రం శీను వంటి అనేక కొత్త నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. సుమన్ శెట్టి వంటి నటీనటులతో పాటు ఆర్పి పట్నాయక్ వంటి సంగీత దర్శకులని కూడా ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం చేశాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తేజ ‘చిత్రం’ సీక్వెల్ పై ప్రకటన చేశారు. ‘చిత్రం 1.1’ పేరుతో రూపొంద‌నున్న ఈ చిత్రం 2021లోనే షూటింగ్ జ‌రుపుకోనుంది. తొలి పార్ట్‌కు సంగీతం అందించిన ఆర్పీ ప‌ట్నాయ‌క్ ఇప్పుడు సీక్వెల్‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేయ‌నున్నారు. చిత్రం సీక్వెల్ లో 45 కొత్త మొఖాలు కనిపించనున్నాయట. న‌టీన‌టులు ఎవ‌రనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. దాదాపుగా 20 ఏళ్ల తరువాత ‘చిత్రం’ సీక్వెల్ రానుండటం విశేషమే అని చెప్పాలి.

allari naresh kosam career lo modhatisari paata padina director vamsy!

regina cassandra excited doing negative roles!