in

police arrested heroine kidnappers!

టి పూర్ణను కిడ్నాప్ చేయాలనుకున్న ముఠా ప్రయత్నం వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో విఫలమైంది. కొచ్చి (కేరళ) పోలీస్ కమిషనర్ విజయ్ సఖారే చెప్పిన దాని ప్రకారం, పూర్ణ (అసలు పేరు షామ్నా కాశిమ్‌)ను కిడ్నాప్ చేయడం ద్వారా ఆమె కుటుంబం నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నించిన 12 మంది ముఠా సభ్యుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమయానికి పూర్ణ ఫిర్యాదు చేయడంతో తమ ప్లాన్‌ను అమలు చేయాలనుకున్న ఆ నిందితులను పోలీసులు అడ్డుకోగలిగారు.

ఈ విషయాన్ని పూర్ణ కూడా ధ్రువీకరించింది. తమ కుటుంబం బ్లాక్‌మెయిల్ స్కామ్‌కు టార్గెట్ అయ్యిందని ఆమె చెప్పింది. “ముందుగా నిందితులు ఒక పథకం ప్రకారం నాకు పెళ్లి సంబంధం తెచ్చామంటూ మా కుటుంబాన్ని సంప్రదించారు. అయితే మమ్మల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించే నకిలీ పేర్లు, నకిలీ అడ్రస్‌లు, మోసపూరిత ఐడెంటిటీలతో వారు మోసం చేశారని తెలియడంతో మా కుటుంబం వారిపై ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించుకుంది. వాళ్లు బ్లాక్‌మెయిల్‌కు దిగడంతో, లీగల్ యాక్షన్ కోసం మేం పోలీసులను సంప్రదించాం. ఇప్పటికీ వాళ్ల ఉద్దేశమేమిటనేది మాకు తెలీదు” అని తన ఫేస్‌బుక్ పేజీలో పూర్ణ రాసుకొచ్చారు.

7 reasons why Chiranjeevi is the undisputed king of Tollywood!

fan shocks shreya at tirumala!