
త్రిష కృష్ణన్..వయసుతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన నటనతో నేటికీ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ఆమె ఎంచుకుంటున్న కథలు, నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు సాధిస్తుండటంతో కోలీవుడ్, టాలీవుడ్లలో త్రిష క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన పారితోషికాన్ని ఆకాశాన్నంతగా పెంచేసినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టి గుసగుసలు వినిపిస్తున్నాయి..ఇటీవల కాలం వరకు ఒక్కో సినిమాకు రూ.5-6 కోట్ల వరకు తీసుకున్న త్రిష..
ఇప్పుడు తన పారితోషికాన్ని ఏకంగా రూ.12-15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య సరసన ఆమె నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో భారీ బ్లాక్బస్టర్ హిట్గా నిలవడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా ఒక పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా, ఈ భారీ మొత్తాన్ని కోరినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ కోసం కేవలం రూ.6 కోట్లకు లోపే తీసుకున్న త్రిష, ఇప్పుడు ఒక్కసారిగా రేటు రెట్టింపు చేయడంతో నిర్మాతలు షాక్కు గురవుతున్నారు..!!
