in

SNEHAMERA JEEVITHAMANNA GIRI BABU!

తెలుగు నటులు, గిరి బాబు గారు, మురళి మోహన్ గారు “జగమే మాయ” అనే సినిమా తో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసారు. ఆ సినిమా లో మొదట గిరి బాబు గారు హీరో క్యారెక్టర్ కు సెలెక్ట్ అయ్యారు, కానీ మురళి మోహన్ గారి ఎంట్రీ తో విలన్ గ మారిపోయారు.ఏమిటి ఆ కదా కమామిషు తెలుసుకోవాలని ఉందా అయితే చదవండి. మాగంటి రాజ బాబు అనే బిజినెస్ మాన్, వారి ఫ్రెండ్స్ ప్రోద్బలం తో ఫోటో షూట్ చేసారు, ఆ ఫొటోస్ చూసిన జగమే మాయ నిర్మాత గారు, రాజ బాబు కి కబురు చేసారు, ఆయనను చూసిన నిర్మాత హీరో క్యారెక్టర్ కు రాజ బాబు ను సెలెక్ట్ చేశారట, అప్పిటికే హీరో గ సెలెక్ట్ అయిన గిరి బాబు గారిని విలన్ క్యారెక్టర్ కి మార్చేశారు.అప్పటికే  రాజ బాబు అనే పాపులర్ కమెడియన్ ఉండటం కారణం గ ఈయన గారికి “మురళి మోహన్” గ నామకరణం చేసారు. ఆ మూవీ రిలీజ్ అయి మంచి హిట్ అయింది, గిరి బాబు గారు, మురళి మోహన్ గారు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు, వారి ఫ్రెండ్షిప్ ఎంత గాఢమయినది అంటే, మురళి మోహన్ గారు సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి దానికి మంచి పేరు కోసం అనుకుంటూ, అప్పటికి”జయభేరి ప్రొడక్షన్స్” అనే పేరుతో గిరి బాబు గారు సినిమాలు ప్రొడ్యూస్ చేసి, గ్యాప్ తీసుకొని ఉన్నారు, మురళి మోహన్ గారు అడిగిన వెంటనే తన జయభేరి ప్రొడక్షన్స్ పేరును మురళి మోహన్ గారికిఇచ్చారు .” ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్” అనేందుకు నిదర్శనం ఈ సంఘటన ,మురళి మోహన్ గారు సినిమా ప్రొడక్షన్ కె కాదు, వారి రియల్ ఎస్టేట్ బిజినెస్ కి కూడ “జయభేరి” పేరును కంటిన్యూ చేసారు.

venky mama reveals the truth!

VENKY MAMA