in

sai pallavi as sita, taking risk for ramayana?

అందాల తార సాయి పల్లవి అజ్ఞాతంలోకి వెళ్లిపోతోందట. ఏ నెలో రెండు నెలలో కాస్త రెస్ట్ తీసుకుని వస్తుందేమో అనుకునేరు. అమ్మడు ఏకంగా ఓ రెండేళ్లపాటూ ఇతర సినిమాలకు దూరంగా ఉండబోతోందట. అదేంటి అని మరీ కంగారు పడకండి. ఈ రెండేళ్లకు సరిపడా ఒక భారీ ప్రాజెక్ట్ తో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతోందట మన అందాల పల్లవి. ఆ మధ్యలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఉత్తరాది ప్రొడక్షన్ హౌస్ లతో కలసి పాన్ ఇండియా రేంజ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నారట. రామాయణంలోని ప్రముఖ ఘట్టాలను వెండితెరపై ఆవిష్కరించబోతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో నటించేందుకు అంగీకారం తెలిపిందట. ఇందుకు గానూ రెండేళ్లు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ కే కేటాయించిందట. అంటే ఈ రెండేళ్లలో పల్లవి మరే ప్రాజెక్ట్ లోనూ నటించే అవకాశం లేదన్నమాటే. ఇక ఈ సినిమాలో శివకార్తికేయన్ కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మరి..సీత పాత్ర కోసం ఇంత రిస్క్ చేయబోతోన్న సాయిపల్లవి ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి..!!

neither Tollywood nor Bollywood, what’s next pooja?

Meet Anchor Suma’s Son, The New Hero of tollywood!