
రెజీనా కాసాండ్రా.. ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిన..ఆ తర్వాత వచ్చిన ‘రోటీన్ లవ్ స్టోరీ’ సినిమాతో మంచి హిట్ కొట్టి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో పిల్లా నువ్వే లేని జీవితం, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ప్రవేశించింది.తాజాగా రెజీ చాలా సార్లు లైగింక వేదింపులకు గురయ్యాను అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు పలువురు ప్రయత్నించారట. వేధింపులు ఎదురయ్యాయి. అలాగే తనని వేధించాలని చూసిన ఒక యువకుడిని పబ్లిక్ ముందే చితక్కొట్టానని కూడా రెజీనా ఒక సందర్భంలో వెల్లడించింది..

