in

pawan kalyan gives green signal to bahubali writer?

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. వకీల్‌సాబ్ పూర్తి అయిన వెంటనే అయ్యనుమ్ కోషియం రీమేక్ అన్నారు. ప్రస్తుతం పవన్ తన తాజా చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పీరియాడికల్ సినిమాగా రూపొందుతన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ తదుపరి చిత్రం గురించి మరో వార్త సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. పవన్ సినిమా కోసం స్టార్ రైటర్ కథ రెడీ చేస్తున్నారంట.

బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ రాశారంటే నటీనటులతో పనిలేకుండా ఆ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉంటాయి. అయితే పవన్‌కు కథ రాయాలని విజయేంద్ర ప్రసాద్ చాలా కాలంగా అనుకుంటున్నారంట. ఈ మేరకు ఇటీవల తన ఐడియాను పవన్‌కు చెప్పడంతో వెంటనే కథను సిద్దం చేయమని పవన్ అన్నారంట. అతి త్వరలోనే కథను పూర్తి చేసుకొని విజయేంద్ర ప్రసాద్ మరోసారి పవన్‌కు వినిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారని అభిమానుల్లో సందేహాలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా వస్తుందేమో వేచి చూడాలి.

Vishwak Sen gives Strong Warning To Youtube Channel!

Trisha replaces Nayanthara in Chiranjeevi’s Lucifer remake!