in

nivetha thomas special role in mahesh’s ‘sarkaru vaari paata’!

హేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే దుబాయ్ లో పూర్తి చేసుకుకుంది. తాజాగా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో మొదలు పెట్టిన సెకండ్ షెడ్యూల్ కి ఇప్పుడు కరోనా విజృంభణతో బ్రేక్ పడింది. కాగా ఈ చిత్రం 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతోంది అంటూ ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్.

తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి సెకండ్ హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’ చిత్రంలో పల్లవి పాత్రలో నటించిన నివేత థామస్, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ లోని సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం నివేదా సైన్ చేసిందని సమాచారమ్. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడం, మహేష్ బాబు హీరో కావడంతో ఈ ఆఫర్ పట్ల చాలా ఎగ్జయిటింగ్ గా ఉందట నివేదా థామస్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.

star heroes wants new comers kriti shetty and kethika sharma!

I don’t have daddy or mommy helping me, says shruthi haasan!