in

Nagarjuna in talks with Tamil director for 100th film?

చిరంజీవి 1988లో త్రినేత్రుడుని తన స్వంత బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించుకున్నారు. వెంకటేష్ కి ఈ ల్యాండ్ మార్క్ ఇంకా దూరంలో ఉంది కానీ నాగార్జున మాత్రం నా సామి రంగా పూర్తి చేయగానే దీని మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాకు ఓకే చెప్పారనే టాక్ గతంలో వచ్చింది కానీ ఆయన తని ఒరువన్ 2కి లాక్ అయిపోవడంతో నాగ్ ప్రాజెక్ట్ రద్దయినట్టుగానే భావించాలి. ఇప్పుడో కొత్త పేరు తెరపైకి వచ్చింది.

కోలీవుడ్ నుంచి నవీన్ అనే దర్శకుడు చెప్పిన లైన్ బాగా నచ్చడంతో నాగ్ సానుకూలంగా ఉన్నారని ఇన్ సైడ్ టాక్. అయితే రిస్కని చెప్పడానికి కారణం ఉంది. సదరు నవీన్ ఇప్పటిదాకా తీసింది రెండు సినిమాలే. మొదటిది 2013లో వచ్చిన మూడర్ కుడం. బాగానే పేరు తెచ్చింది. తర్వాత 2021లో విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ హీరోలుగా అగ్ని సిరగుగల్ తీశారు. కానీ రెండేళ్లు దాటుతున్నా ఇది విడుదలకు నోచుకోలేదు. కారణాలు చెప్పడం లేదు కానీ అదిగో ఇదిగో అంటూ ఆలస్యం చేస్తూనే ఉన్నారు. అంటే పది సంవత్సరాల టైంలో నవీన్ చేసింది రెండు సినిమాలే.

uppena beauty Krithi Shetty fate may change again!

nayanthara offered in another bollywood biggie?