in

Macho hero as villain in Mahesh Babu – Rajamouli film?

తేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ అంటూ ఓ భారీ హిట్ సాధించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తదుపరి చిత్రం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ కరోనా కారణం గా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కెరీర్ లో 27 వ చిత్రం గా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ లో కీర్తి సురేష్ తో మొదటిసారిగా జతకట్టాడు మహేష్. ఈ సినిమా తరువాత మహేష్ 28 వ సినిమా ఇప్పటికే అనౌన్సమెంట్ వచ్చింది. త్రైవిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేయనున్నాడు మహేష్.

రాజమౌళి మహేష్ బాబు కాంబోలో సినిమా రాబోతుంది అంటూ కొన్నేళ్లుగా వింటూనే ఉన్నాం. నిజానికి ఈ వార్త ఇప్పటిది కాదు. బాహుబలి కంటే ముందు నుంచే మహేష్ రాజమోళి కాంబో చర్చల్లో ఉంది. అయితే ఇప్పుడు మహేష్ 29 వ సినిమాగా రాజమౌళి సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసమే మహేష్ మరో పాన్ ఇండియా సినిమాలో శ్రీరాముడి పాత్రను వదులుకున్నాడు. కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు కథను అందించేది విజయేంద్ర ప్రసాద్ అని తెలుస్తుంది.

హాలీవుడ్ చిత్రం ‘ఇండియానా జోన్స్’ ను పోలిన కథతో తెరకెక్కనున్న ఈ సినిమాను జక్కన్న పాన్ ఇండియా స్థాయిని మించి తెరకెక్కించనున్నాడట. తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి ఈ సినిమాను కూడా మల్టీ స్టారర్ చేయనున్నారని సమాచారం. టాలీవుడ్ హీరో గోపీచంద్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడట. కెరీర్ మొదట్లో విలన్ గా రాణించిన గోపీచంద్, ఆ తరువాత హీరోగా కొన్ని హిట్లు అందుకున్న విషయం తెలిసిందే..గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే.

Swayam krushi BUDDODU YEMAYYADU!

samantha roped in for another sizzling item song ?