in

Kriti Sanon Books whole Theatre To Screen Adipurush For Students!

వివాదాలు, విమర్శలు పక్కన పెడితే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ మంచి కలెక్షన్లు సాధిస్తోంది ‘ఆది పురుష్’.ఈ సినిమాని చిన్నారులకు చూపించడానికి ఇప్పటికే మంచు మనోజ్ వంటి ప్రముఖులు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కూడా చేరిపోయింది. ఈమె ఈ చిత్రంలో సీత పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చిన్నారులకు చూపించడానికి ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్ మొత్తాన్ని బుక్ చేసిందట.

తాను చిన్నప్పుడు చదువుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోని విద్యార్థులకు ఈ సినిమాను చూపించేందుకు 300 టికెట్లు కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. గత వారం విడుదలైన ‘ఆది పురుష్’ తొలి రోజు విమర్శలు మూట కట్టుకుంది. ఈ సినిమాలోని పాత్రధారుల వేషధారణ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి అయితే వీటన్నింటికీ మూవీ టీం సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాకి ఓమ్ రౌత్ దర్శకుడు..!!

SOUND ENGINEER TURNED AS SILVER SCREEN ANJANEYA!

crazy combo, chaithu to romance keerthy suresh!