in

kiara advani out, pooja hegde in for ntr30!

తంలో వీరి కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా కోసం మొదటి నుండి కూడా ఇద్దరు హీరోయిన్స్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. పూజా హెగ్డే మరియు కియారా అద్వానీ. వీరిద్దరితో కూడా కొరటాల శివ వర్క్ చేశాడు. పూజా హెగ్డేతో ఆచార్య సినిమాలో వర్క్ చేస్తున్న కొరటాల శివ గతంలో భరత్ అనే నేను సినిమా ద్వారా కియారాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కనుక ఈయన సినిమాలో ఇద్దరిలో ఎవరు నటించినా కూడా ఖచ్చితంగా వారి క్రేజ్ మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.

గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగినట్లుగా కియారా అద్వానీ కాకుండా పూజా హెగ్డే ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. రాధే శ్యామ్ మరియు బ్యాచిలర్ సినిమాలతో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వస్తే ఈమె క్రేజ్ మరింతగా పెరుగుతుంది. పైగా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. తమిళంలో ఈమె విజయ్ కు జోడీగా నటిస్తుంది. కనుక పాన్ ఇండియా అప్పీల్ ఉన్నందున పూజా హెగ్డేను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట.

ananya pandey glamorous pics sitting on a sofa!

Hot And Sizzling Tamanna’s Ramp Walk At Lakme Fashion Week!