in

Janhvi Kapoor to debut in Telugu with Krishna Vamsi’s next?

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో ఆయన ఓ చిత్రం చేయడానికి సిద్దమయ్యారని అందులో జాన్వీకపూర్ కీలక పాత్రలో నటించబోతుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఓ కథను సిద్ధం చేసుకున్నారట, దానికి సంబంధించిన స్క్రిప్టు కూడా సిద్ధమైందని తెలుస్తోంది. జాన్వీ కపూర్‌ నటించిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ చూసిన తరువాత కృష్ణవంశీ రాసుకున్న కథకు జాన్వీ అయితేనే సరిపోతుందని భావించారట.
ఇప్పటికే జాన్వీ తండ్రి బోనీకపూర్‌తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే బోనీ కపూర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేనట్లు తెలుస్తోంది. బోనీ నిర్మాతగా హిందీలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘శక్తి: ది పవర్‌’ అనే చిత్రం రూపొందించారు. ఈ విధంగా చూస్తే జాన్వీ కపూర్‌ని తెలుగు తెరకు పరిచయం చేసే అదృష్టం వంశీకే దక్కనుంది. ప్రస్తుతం ఆయన ‘రంగ మార్తాండ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జాన్వీ ‘గుడ్‌ లక్‌ జెర్రీ’, ‘రూహి’, ‘దోస్తానా2’లాంటి చిత్రాలతో బిజీగా ఉంది.

gopichand to romance eesha rebba in his next!

director nag ashwin says sorry to prabhas fans!