in

director nag ashwin says sorry to prabhas fans!

ప్రభాస్ అభిమానులకు మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ క్షమాపణలు తెలిపారు. కొన్ని రోజుల క్రితం నాగ్ అశ్విన్ తన తాజా చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయనున్న సినిమా నుంచి రెండ్ అప్‌డేట్‌లు రానున్నాయని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం నాగ్ అశ్విన్ తన మొదటి అప్‌డేట్‌ను ఇచ్చారు. ఆ తరువాత రెండో అప్‌డేట్ ఈ నెల 26న రానుంది. ఈ విషయంపైనే నాగ్ అశ్విన్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణ చెప్పారు.

ఇటీవల ప్రభాస్ అభిమాని ఒకరు ప్రభాస్-నాగ్ అశ్విన్ అప్‌డేట్ మరో పది రోజుల్లో రానుందని, ఆ అప్‌డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. దానికి దర్శకుడు నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ.. తనను క్షమించమని, ఈ నెల26కి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేమని, అది సరైన సమయం కాదంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్లే ఈ అప్‌డేట్ ఇవ్వలేక పోతున్నారంట. ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు ఎంతో నిరాశకు గురవుతున్నారు.

Janhvi Kapoor to debut in Telugu with Krishna Vamsi’s next?

jr ntr very emotional speech about road safety!