in

Gopichand and Rashi Khanna to team up for the third time!

భూమి గుండ్రంగానే వుంది. అందుకే డైరక్టర్ మారుతి ఎక్కడ ఎలా ట్రయ్ చేసినా, ఆఖరికి హీరోయిన్ క్యారెక్టర్ రాశీఖన్నా దగ్గరే ఆగింది. ఆమెనే వరించింది. గోపీచంద్ హీరోగా మారుతి డైరక్షన్ లో ప్రారంభం కావాల్సిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాకు ఆరంభంలో హీరోయిన్ గా రాశీ ఖన్నా పేరే వినిపించింది.  కానీ అంతలోనే హీరో అంత ఆసక్తి గా లేడని ఒక్కపక్క, రాశీనే చేయను అన్నది అంటూ మరో పక్క గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది.

దర్శకుడు మారుతి కూడా కొత్త మొహాల కోసం ట్రయ్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే నిర్మాతలు అయిన యువి సంస్థ మాత్రం రాశీఖన్నా వైపే మొగ్గింది.  మారుతికి కూడా మరో మాంచి, సూక్ష్మంలో మోక్షమైన ఆప్షన్ కనిపించలేదు. పైగా చకచకా సినిమా ఫినిష్ చేయాలి. అందుకే ఇక చివరాఖరుకి రాశీఖన్నాకే ఓటు వేసేసారు. ఆ విధంగా మారుతి డైరక్షన్ లో మరోసారి రాశీఖన్నా చేయబోతోంది. జిల్, ఆక్సిజన్ సినిమాల తరువాత గోపీచంద్ తో ముచ్చటగా మూడో ప్రయత్నం చేయబోతోంది.

anchor srimukhi’s sarcastic reply shocks her fan!

samantha to take a break from films?