in

dimple hayathi tests positive even after taking two doses of vaccine!

ప్రస్తుతం భారత్‌లో 8,209 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అయితే సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు…ఈ లిస్ట్‌లో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు వున్నారు. ముఖ్యంగా సినీ కళాకారులు పెద్ద సంఖ్యలో పాజిటివ్‌గా తేలుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రమ్, వడివేలు, త్రిష, అరుణ్ విజయ్, సత్యరాజ్, మహేశ్ బాబు, తమన్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, కరీనా కపూర్, అమృతా అరోరా వంటి స్టార్స్ కరోనా బారినపడ్డారు.

తాజాగా ఈ లిస్ట్‌లోకి యువ హీరోయిన్ డింపుల్ హయాతి చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నానని.. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని డింపుల్ చెప్పారు. అయినప్పటికీ వైరస్ సోకిందని.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి డాక్టర్ల సూచనలను, సలహాలను పాటిస్తున్నానని హయాతి పేర్కొన్నారు…

అందరూ మాస్క్‌ ధరించి… శానిటైజ్‌ చేసుకోవాలని, తప్పనిసరిగా టీకా తీసుకోవాలని డింపుల్ విజ్ఞప్తి చేశారు. కాగా గతేడాది మేలో హయతి కుటుంబంలో ఏకంగా పదిమంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు డింపుల్ హయతి. ఇటీవల ‘అత్రంగి రే’ చిత్రంలోనూ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజా రవితేజతో కలిసి ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తున్నారు. దీంతోపాటు పలు తమిళ చిత్రాలకు సైతం హయాతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

big boss fame divi interesting comments about mahesh babu!

Popular actress nikki galrani gets robbed, files a complaint!