in

clash between rashmika and mythri movie makers?

పుష్ప సినిమా టైంలో రష్మిక, మైత్రీ మధ్య మంచి మైత్రీ ఉండేదట. ఈ సన్నిహిత్యంతోనే పుష్ప పార్ట్ 2 కాకుండా, మరో రెండు సినిమాల అగ్రిమెంట్‌కి రష్మిక సైన్ చేసిందట. కానీ, రెమ్యునరేషన్ తో పాటు ఇతర విషయాల్లో రష్మిక, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య చిన్నగా వివాదం స్టార్ట్ అయిందట. అది కాస్త చిలికి చిలికి గాలి వానలా తయారైందని తెలుస్తుంది. దీంతో ముందుగా మైత్రీ మూవీ మేకర్స్‌తో రష్మిక చేసుకున్న అగ్రిమెంట్స్ ని క్యాన్సిల్ చేసుకుందని టాక్. అందువల్లే మైత్రీ వాళ్లు నిర్మిస్తున్న నితిన్, వెంకీ కుడుముల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.

దీనితో పాటు రీసెంట్ గా మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చే మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మికనే అనుకున్నారట. కానీ, మైత్రీతో ముదురుతున్న వివాదం వల్ల దీని నుంచి కూడా తప్పుకుందట. అంతే కాదు, పుష్ప2 ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అని రష్మిక వెయిట్ చేస్తుందని తెలుస్తుంది. పుష్ప2 రిలీజ్ అయిన వెంటనే మైత్రీతో ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుని, ఆ బ్యానర్ లో మళ్లీ సినిమాలు చేయొద్దని ఫిక్స్ అయిపోయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది..!!

rana to lock horns with chiranjeevi?

Suriya and Sudha Kongara reunite, Dulquer, Nazriya on board!