in

adipurush team to dedicate 1 seat to Lord Hanuman in every theatre!

తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్ల రూపాయలకు దక్కించుకుని రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఒక సరికొత్త సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది . తాజాగా సినిమా రిలీజ్ గురించి థియేటర్స్ గురించి అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్ లో రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటికి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం, ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ఆది పురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి ధియేటర్లో..

ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతోంది. అతి గొప్ప రామభక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం, ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ఆది పురుషుని హనుమంతుడి సమక్షంలో అందరూ తప్పక వీక్షిద్దాం అంటూ ప్రెస్ నోట్లో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలోనే కాదు మరే సినిమా చరిత్రలోను ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు..!!

udaya bhanu makes her re entry in tollywood!

balayya prefers bobby over boyapati?