in

aa heroine tho murali mohan gariki rendu sarlu pelli chesina oka journalist!

మురళి మోహన్ గారికి ,హీరోయిన్ జయచిత్ర గారికి రెండు సార్లు పెళ్లి చేసిన ఒక జర్నలిస్ట్ ప్రబుద్దుడు.వీరిద్దరూ కల్సి చాల చిత్రాలు నటించారు, అదే సమయం లో మురళి మోహన్ గారు సొంత నిర్మాణ సంస్థ ” మురళి చిత్ర” అనే పేరుతో ప్రారంభించారు, ఇక మన వాడి ఉత్సాహానికి అవధులు లేవు, ఇద్దరి పేరు మీద ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ చేసారు వీరిద్దరూ త్వరలో ఒక్కటి అవ్వబోతున్నారు అని, బాక్స్ కట్టి రాసేసాడు. అది చూసిన ఇండస్ట్రీ అంత ఉలిక్కిపడింది. అటువంటిది ఏమి లేదని కంఫర్మ్ చేసిన మురళి మోహన్ గారు అతనికి నోటీసు పంపించారు.ఆ పత్రిక వారు మురళి మోహన్ గారికి సారీ చెప్పటం తో వివాదం సమసి పోయింది.

కొద్దీ రోజుల తరువాత ఏదో షూటింగ్ నిమిత్తం మద్రాస్ నుండి హైదరాబాద్ బయలుదేరారు మురళి మోహన్ గారు ఎయిర్ పోర్ట్ లో దాసరి గారు కలిశారు, ఇంతలో జయచిత్ర గారు కూడా అదే ఫ్లైట్ కోసం రావటం తో ముగ్గురు కలసి ఫ్లైట్ ఎక్కారు, ఎక్కడనుంచి చూశాడో ఏమో , దాసరి గారి ఆధ్వర్యం లో మురళి మోహన్, జయచిత్ర హైదరాబాద్ లో పెళ్లి చేసుకోబోతున్నారు అని వ్రాసేసాడు. అది చూసి వళ్ళు మండిన, మాటి, మాటికీ స్పందించటం ఇటువంటి వారికీ ఇంకొంత ఉత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుంది అనుకోని లైట్ తీసుకొన్నారు. ఆ తరువాత అటువంటి వార్తలు వ్రాయలేదు ఆ మహానుభావుడు. ఆ రోజుల్లో కేవలం గాసిప్ వార్తల మీదే బ్రతికే కొంతమంది జర్నలిస్టులు, పత్రికలూ ఉండేవి.

rumors viral about vaishnav tej’s first remuneration!

Rashmika Mandanna Buys Lavish Flat In Mumbai!