
వెండితెరపై ఒక నటుడో లేదా నటి రాణించాలి అంటే అది అంత సులువు కాదు. తాము తెరపై కనిపించి నిలదొక్కుకోవాలి అంటే ఆ ప్రయాణం ఎవరికీ అంత సజావుగా సాగదు. అలానే లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే కూడా తన జర్నీ విషయంలో చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. చాలామందికి ఇంట్లో సినిమాల్లోకి వెళతాను అని చెబితే వద్దనే సమాధానం ఎలా వినిపిస్తుందో అదే సమాధానం భాగ్యశ్రీకి కూడా ఎదురైందట..
ఇలా సినిమాల్లోకి వెళతాను అంటే తన జర్నీలో ఎవరూ తన కుటుంబం నుంచి చిన్న ప్రోత్సాహం కూడా అందించలేదని ఆమె రీసెంట్ ఓ ఇంటరాక్షన్ లో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన నిర్ణయాన్ని విని వాట్సాప్ లో కూడా బ్లాక్ చేసారని ఆమె ఇంకో షాకింగ్ విషయాన్ని కూడా ఆమె లైఫ్ నుంచి షేర్ చేసుకుంది. ఇలా ఆమెకి కూడా కొన్ని అవమానాలు ఎదురుకాక తప్పలేదు. అయితే తాను ఏం చేసిన తన కుటుంబం ఆర్ధికంగా నిలబడాలి అనే చేసానని ఇటీవల అఖిల్ ‘లెనిన్’ ప్రయాణంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె కోరుకున్న సక్సెస్ కూడా అందుకొని ఆ వైబ్ ని ఎంజాయ్ చేస్తుంది..!!

