
సూర్య మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘జై భీమ్’ తర్వాత ఆయన మరోసారి దర్శకుడు టీజే జ్ఞానవేల్తో జతకట్టారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్-ఇండియా బ్లాక్బస్టర్లను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమా ముహూర్తపు వేడుకను ఘనంగా నిర్వహించారు. సూర్య, హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్లో ఇదే తొలి చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్గా కయాదు లోహర్ నటిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కతిర్ సినిమాటోగ్రాఫర్గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్గా పనిచేయనున్నారు. కమర్షియల్ అంశాలతో కూడిన ఒక పవర్ఫుల్, గ్రిట్టి డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇటీవలే రజనీకాంత్తో ‘వెట్టైయాన్’ సినిమాను తెరకెక్కించిన జ్ఞానవేల్, వెంటనే సూర్యతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు..!!

