
బాలీవుడ్ వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అందాల తార జాన్వీ కపూర్, ఇప్పుడు నెట్టింట వినిపించే విమర్శలకు ధీటైన సమాధానమిస్తూ వార్తల్లో నిలిచారు. గ్లామర్ ప్రపంచంలో సెలబ్రిటీల గురించి వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి..
సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శల గురించి జాన్వీ స్పందిస్తూ చాలా పరిణతి చెందిన మాటలు చెప్పారు. ఇంటర్నెట్లో ఎవరో ఏదో అన్నారని నేనెప్పుడూ బాధపడను. ఇప్పుడు అందరికీ వ్యూస్, లైక్స్ కావాలి. అందుకే సెలబ్రిటీల పేర్లను వాడుకుని వివాదాస్పద కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. వారి పేజీలకు క్లిక్స్ తెచ్చుకోవడానికి మనల్ని ఒక బలిపశువులా వాడుకుంటారు. ఒకసారి ఇది వారి బిజినెస్ అని మనకు అర్థమైతే, ఆ మాటలను పట్టించుకోవడం మానేస్తాం అంటూ ట్రోలర్ల అసలు రంగును బయటపెట్టారు..!!

