in

anasuya: vijay fans are getting paid for trolling me

నసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “2019లో, విజయ్ దేవరకొండ తండ్రి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో నేను కూడా నటించాను. అప్పటి వరక అంతా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత విజయ్ టీమ్‌లోని ఒకరు నన్ను తిట్టడానికి ఆయన పబ్లిసిస్ట్ (ప్రచారకర్త) నన్ను ట్రోల్ చేయడం కోసం కొందరికి డబ్బులిచ్చిన్నట్లు చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. పబ్లిసిస్ట్ పెయిడ్ ట్రోల్స్ చేసి ఉంటే విజయ్‌కి తెలిసే ఉంటుంది కదా. అతనికి తెలియకుండా వారు ఇలాంటి పని చేయరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఇది సరైనదేనా?’’ అని మండిపడింది.

వాస్తవానికి విజయ్, తాను మంచి స్నేహితులం అని అనసూయ చెప్పింది. ఇద్దరం కలసి పలు సినిమాల్లో కూడా నటించామని తెలిపింది. ఎప్పుడూ మంచి స్నేహితుల్లానే ఉండేవాళ్లమని, అయితే ‘అర్జున్ రెడ్డి’ ఘటన తర్వాత ట్రోల్స్ మొదలవ్వడంతో దీని వెనుక విజయ్ హస్తం కూడా ఉందని అనుకున్నానని చెప్పింది అనసూయ. అయితే విజయ్ తన మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నాడో తెలియదని, అయినా ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిద్దామని అనుకుంటున్నానని వెల్లడించింది. తాను మానసికంగా ప్రశాంతత కోరుకుంటున్నానని ఇవన్నీ పక్కనపెట్టి జీవితంలో ముందుకు సాగాలని అనుకుంటున్నానని తెలిపింది అనసూయ..!!

rana missed the role of hanuma in adipurush?

telugu actress Megha Akash getting married to a politician’s son?