in

jhanvi kapoor: social media helps to pay my emi bills

దివంగత హీరోయిన్ శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో అతి తక్కువ సమయం లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు వెండితెరపై సందడి చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియా లోనూ ఫుల్ యాక్టి్వ్‏గా ఉంటుంది జాన్వీ. సోషల్ మీడియాలో జాన్వీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈమెకు కేవలం ఇన్ స్టాగ్రామ్ లోనే దాదాపు 2.3 కోట్లు (20.3 మిలియన్స్) ఫాలోవర్స్ ఉన్నారు. జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోస్ మాత్రం గ్లామరస్ గా ఉంటాయి. దీంతో ఆమెకు ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె సోషల్ మీడియా ఫోటోస్ గురించి అడగ్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇన్ స్టాలో మీరు పోస్ట్ చేసే అల్ట్రా గ్లామరస్ ఫోటోలను చూసిన ప్రేక్షకులు వెండి తెరపై మీ డి గ్లామరస్ పాత్రలను అంగీకరించలేకపోతున్నారు అంటూ యాంకర్ ప్రశ్నించింది. అందుకు సమాధానంగా జాన్వీ మాట్లాడుతూ..“వాస్తవానికి నేను నా నిజ జీవితంలో తెరపై కనిపించే దానికి పూర్తిగా భిన్నంగా ఉంటాను. నేను సోషల్ మీడియాలో సరదాగా గడపాలనుకుంటాను..నేను దీనిని అంత సీరియస్ గా తీసుకోను. నేను క్యూట్ గా కనిపిస్తే మరో ఐదుగురు వ్యక్తులు నాఫోటోలను ఇష్టపడితే నేను అదనంగా మరొక బ్రాండ్ ను పొందుతాను. ప్రకటనల్లో నటించి నా ఈఎంఐలు చెల్లించగలనని ఆశిస్తున్నాను. ఇంతకు ముందు కంటే చాలా సులభంగా ఇప్పుడు ఈఎంఐలు చెల్లిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ. అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రానున్న సినిమాలో జాన్వీ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Yashoda!

Varun Tej to romance Miss India in his next?