in

MONTHLY SALARY N.T.R KI TECCHINA THIPPALU!

మొదటి తరం నటి నటులు అందరు నెల జీతం తీసుకొని సినిమాలకు పని చేసే వారు. ఎస్.వి.ఆర్, యెన్.టి.ఆర్,ఏ.యెన్.ఆర్,రేలంగి, సావిత్రి, సూర్యకాంతం వంటి సీనియర్ నటులు అందరు నెల జీతం మీద పని చేసిన వారే. ఈ జీతాలకు సంబంధించి, విజయ వారు మిస్సమ్మ చిత్రం నిర్మిస్తున్నపుడు ఒక ఆసక్తికరమయిన సంఘటన జరిగింది. మిస్సమ్మ లో నటిస్తున్న యెన్.టి.ఆర్. కి 75 రూపాయలు, ఏ.యెన్.ఆర్. 30 రూపాయలు సావిత్రి కి 70 రూపాయలు , రేలంగి కి 55 , జమునకు 45 , ఇలా ఈ మొత్తాన్ని ఒకే చెక్ రాసి అన్నగారి చేతిలో పెట్టి అందరు తీసుకోండి అని చెప్పారట. జమున, అక్కినేని, రేలంగి, ముగ్గురు వారి,వారి డబ్బులు తీసుకొని వెళ్లిపోయారట..

చివరకు మిగిలిన డబ్బులో చిల్లర లేక సావిత్రి 5 రూపాయలు ఎక్కువ తీసుకొని, రేపు కలసి నప్పుడు ఇస్తానని మిగతా డబ్బు యెన్.టి.ఆర్. చేతిలో పెట్టి వెళ్లిపోయారట. ఆ తరువాత నెల రోజుల వరకు సావిత్రి వేరే షూటింగ్లో ఉంటూ యెన్.టి.ఆర్. ని కలవలేదట. ఈ లోపు అన్నగారి దగ్గర డబ్బులు నిండుకున్నాయి, డబ్బుకి కట,కట, ఏదయితే అదయిందని సావిత్రి రూమ్ వెతుక్కొని వెళ్లి తన 5 రూపాయలు అడిగి తెచ్చుకున్నారట యెన్.టి.ఆర్. యెన్.టి.ఆర్. క్లాస్ మెట్, సహా నటుడు ఐన జగ్గయ్య గారు యెన్.టి.ఆర్ అంతటి వాడికే డబ్బులకు ఇబ్బంది తప్ప లేదు అని చెప్తూ ఈ సంఘటన గురించి చెప్పేవారట..!!

Janhvi Kapoor: ‘You can’t marry everyone you like’

Tamannaah joins Superstar Rajinikanth for ‘Jailer’ ?