in

naveen polishetty punch dialogues on prabhas movie budgets!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జాతిరత్నాలు’ ఫేం హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా పంచ్‌ల పంచ్‌లు వేస్తూ అందరినీ కాసేపు కడుపుబ్బా నవ్వించాడు. సాధారణంగా ప్రతి సినిమాకు ఫైనాన్షియర్స్ ఉంటారని.. కానీ ప్రభాస్ సినిమాకు ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారని పంచ్ వేశాడు. అంతటితో ఆగకుండా ప్రభాస్ సినిమాల బడ్జెట్ గురించి సరదాగా వ్యాఖ్యానించాడు.

పార్లమెంట్‌లో హెల్త్ కోసం రూ.500 కోట్లు, ఎడ్యుకేషన్ కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లే ప్రభాస్ సినిమాలకు రూ.2వేల కోట్లు కేటాయించాలని ఛమత్కరించాడు. ఓం రావత్‌తో తీస్తున్న ఆదిపురుష్ మూవీకి రూ.400 కోట్లు, నాగ్ అశ్విన్ సినిమాకు రూ.800 కోట్లు, సందీప్ వంగాతో తీస్తున్న ‘స్పిరిట్’ మూవీకి రూ.500 కోట్లు కేటాయించామని నవీన్ పోలిశెట్టి తెలిపాడు. అటు యువీ క్రియేషన్స్‌పైనా జాతిరత్నం పంచ్ వేశాడు. యువీ బ్యానర్ నుంచి అప్‌డేట్స్ త్వరగా ఎందుకు రావని డైరెక్టుగా నిర్మాత వంశీని అడిగేశాడు. దీనికి తమ కార్యాలయంలో ఇంటర్నెట్ సమస్య ఉందని నిర్మాత వంశీ నవ్వుతూ సమాధానమిచ్చాడు.

‘Radhe Shyam’ Theatrical Trailer, Prabhas, Pooja Hegde!

Sukumar to come up with a high budget web-series for ‘aha’!