in

Balakrishna confirms his son’s debut with ‘Aditya 369’ sequel

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ వెండితెర ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చ‌ర్చ న‌డుస్తుంది. రేపో మాపో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖాయ‌మ‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంట‌న్న స‌మ‌యంలో ఇటీవ‌ల బాల‌కృష్ణ త‌న త‌న‌యుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు క్లాసిక్ మూవీతో త‌న త‌న‌యుడిని బాల‌య్య ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాడ‌ని తెలుసుకొని ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు.ఆదిత్య 369 చిత్రం ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో..

ఎప్పుడు మోక్ష‌జ్ఞ‌ను వెండితెర‌పై చూస్తామా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో బాల‌య్య మ‌రోసారి స్పందించాడు. ఆదిత్య 369 చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ.. ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇక ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పిన ఆయన, ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూ తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు.

Upasana Kamineni’s younger sister To Marry Athlete!

CAREER PRARANBHA DASALO BULLI TERA MEEDA MERISINA MEGA STAR!