in

prabhas and pooja to fly to Italy soon!

రు నెలల విరామం తర్వాత ప్రభాస్‌ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టనున్నారు. గోపీకృష్ణమూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకుడు. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ మొదటివారంలో పునఃప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. కీలక షెడ్యూల్‌ కోసం చిత్రబృందం ఇటలీ దేశానికి పయనం కానున్నట్లు చెబుతున్నారు. పదిహేను రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌, పూజాహెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్య ఘట్టాలను చిత్రీకరించబోతున్నట్లు తెలిసింది, వచ్చే ఏడాది ఈసినిమా ప్రేక్షకుల ముందుకురానున్నది..

balayya’s next with mahesh babu’s director!

mama alludu to do movie again?