in

vijay shanthi in for a crazy sequel!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]దా[/qodef_dropcaps] దాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు` కాకుండా పలు చిత్రాలకు సంతకాలు చేశారు అంటూ టాక్ వినిపిస్తుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో విజయశాంతి గారు లెక్చరర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి విజయశాంతి అంగీకరించడం వెనక ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది అంటూ ఫిలిం నగర్ చాల వార్తలు సందడి చేస్తున్నాయి.

అదేంటంటే, `సరిలేరు నీకెవ్వరు` సినిమా రాయలసీమ నేపథ్యం ఉన్న కథ, ఈ చిత్రం యొక్క మెజారిటీ భాగాన్ని కర్నూల్ సిటీ లొ తీయడానికి ప్లాన్ చేసారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కానీ అక్కడ కండిషన్స్ తనకు సూట్ అవ్వవు అంటూ విజయ్ శాంతి గారు చెప్పడంతో తన కోసం ఇక్కడే హైదరాబాద్ లొ కర్నూల్ సెట్ వేసారట, ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది రామోజీ ఫిలిం సిటీ లొ ఈమద్యే వేసిన కర్నూల్ కొండా రెడ్డి బురుజు సెట్. అయితే, కేవలం తాను చెప్పిన మాట కోసం, అనిల్ హైదరాబాద్ లొనే కర్నూల్ సెట్ వేయడం, ఖర్చు గురించి ఆలోచించకుండా తనకు ఇచ్చినా గౌరవం విజయ్ శాంతి గారికి బాగా నచ్చిందట అందుకే `సరిలేరు నీకెవ్వరు`లొ నటించడానికి ఓకే చెప్పారంట. అంతేకాకుండా అనిల్ త్వరలో తీయబోతున్న ‘ F2 ‘ కి సీక్వెల్ ‘F3’ లొ కూడా నటించేందుకు విజయ్ శాంతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

‘sye-raa’ first talk!

CAN YOU GUESS THE MOVIE NAMES IN WHICH OUR TOLLYWOOD DIRECTORS PLAYED A CAMEO ROLE?