in

shruthi haasan to do guest role to fulfil his director’s sentiment!

టాలీవుడ్ లో నంద‌మూరి బాల‌కృష్ణ, గోపీచంద్ మ‌లినేని కాంబోలో సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని మ‌రోసారి శృతిహాస‌న్ ను తీసుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నం చేశాడు. కానీ శృతిహాస‌న్ మాత్రం సింపుల్ గా ఆఫ‌ర్ కు నో చెప్పింది. శృతిహాస‌న్ తో ఇప్ప‌టికే రెండు మూడు సినిమాలు చేయ‌డంతో గోపీచంద్ మ‌లినేనికి బాగా క‌లిసొచ్చింది. ఇదే సెంటిమెంట్ బాల‌య్య చిత్రానికి కూడా పనిచేస్తుంద‌ని శృతిహాస‌న్ ను సంప్ర‌దించి స్టోరీ కూడా చెప్పాడ‌ట గోపీచంద్ మ‌లినేని.

అయితే కెరీర్ జోష్ మీదున్న ఇలాంటి పరిస్థితుల్లో బాల‌కృష్ణ లాంటి సీనియ‌ర్ హీరోతో న‌టించ‌లేన‌ని సున్నితంగా ఈ ప్రాజెక్టు నుంచి శృతిహాస‌న్ త‌ప్పించుకున్న‌ట్టు టాలీవుడ్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే త‌న నిర్ణ‌యంతో గోపీచంద్ మ‌లినేని నిరాశ చెందాడ‌ని తెలుసుకున్న శృతిహాస‌న్.. బాల‌య్య ప్రాజెక్టులో గెస్ట్ రోల్ అయితే న‌టిస్తాన‌ని చెప్పింద‌ని లేటెస్ట్ టాక్‌. మొత్తానికి గోపీచంద్ మ‌లినేనికి నో చెప్ప‌కుండా మంచి స‌ల‌హా ఇచ్చి ప్రాజెక్టు నుంచి సున్నితంగా ప‌క్క‌కు త‌ప్పుకుంద‌నుకుంటున్నారు టాలీవుడ్ జ‌నాలు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో క‌లిసి స‌లార్ చిత్రంలో న‌టిస్తోంది శృతిహాస‌న్‌.

kanche beauty Pragya Jaiswal’s Glam Photoshoot!

Rakul Preet singh’s comedy Web Series On The Way!