in

Samantha’s Malayalam debut or Vidya Balan’s comeback?

లయాళ సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ పింక్ పోలీస్ పేరుతో ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో మహిళా ప్రధాన కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్ల సమాచారం. ఈ థ్రిల్లర్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సమంత ఈ సినిమాను అంగీకరించే అవకాశం ఉందని అంటున్నారు. మలయాళంలో రూపొందనున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడంతో పాటు హిందీలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అన్ని భాషల్లో సమంతకు ఫాలోయింగ్ ఉండటంతో నే చిత్ర బృందం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

సమంతతో పాటు నయనతార, విద్యాబాలన్ ల పేర్లు కూడా కథానాయిక లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. సమంత డేట్స్ అడ్జెస్ట్ కానీ పక్షంలో  ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. తెలుగులో సమంత శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో కథానాయికగా కనిపించబోతున్నది. ఇటీవలే ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. ఈ ఏడాదే మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.హిందీలో రాజ్ డీకేలతో  ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత..

WHO IS THIS “GHATTAMMA” ?

gorgeous Poonam Bajwa Latest Photoshoot Stills!