in

sakshi vaidhya replaces rashmika for akhil’s next!

క్కినేని బుల్లోడు అఖిల్.. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం చేస్తున్నాడు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ క్రేజీ వెంచర్.. 2021 జనవరిలో థియేటర్స్ ముంగిట సందడి చేయనుంది. ఇదిలా ఉంటే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తరువాత స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ చేయబోతున్నాడు అఖిల్.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అఖిల్ కి జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల కథానాయిక దొరికేసిందట. అఖిల్ 5వ సినిమాలో అతడితో రొమాన్స్ చేసేందుకు మోడల్ కమ్ హీరోయిన్ సాక్షి వైధ్యను ఎంపికచేశారట. దర్శకుడు సురేందర్ అభిప్రాయం ప్రకారం అఖిల్‌కు ఆమె సరైన జోడీగా ఉంటుందట

Rashi Khanna to mark her comeback in Bollywood!

Keerthy Suresh facing marriage pressure from parents?