in

Re-digitalised version of Sridevi’s ‘Padaharella Vayasu’!

దహారేళ్ల వయసు చిత్రం శ్రీదేవి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా వచ్చి దాదాపు 42 ఏళ్లు అవుతోంది. చంద్రమోహన్, మోహన్ బాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మాతృక, ‘పదునారు వయనదిలే’ అనే తమిళ చిత్రం. భారతీరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ్‌లో కూడా శ్రీదేవేనే హీరోయిన్‌గా నటించగా.. కమల్ హాసన్, రజనీకాంత్ కీ రోల్ పోషించారు.

అప్పట్లో ‘పదినారు వయనిదిలే’.. సినీ ప్రియులకు ఎంతగానో ఆకట్టుకొని, పలు అవార్డులు సొంతం చేసుకుంది. తమిళ్‌ వెర్షన్‌కు ఇళయా రాజా సంగీతం అందించారు. ఇప్పుడు ఈ సినిమాను తిరిగి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధునాతన డాల్బీ సౌండ్‌తో, తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి, అన్ని పాటలను మళ్ళీ కొత్తగా రిలీజ్ చేశారు.. ఈ చిత్రానికి తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ టైటిల్ పెట్టారు.

కొత్త హంగులతో వస్తున్న ‘పదినారు వయనిదిలే’ చిత్రాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంత‌రం, మ‌రో 5 భాషల్లో డ‌బ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది.

anasuya consumes red wine daily!

regina shocks her fans!