in

Prabhas spent rs 4 cr for Food Arrangements for Fans?

నిన్న మొగల్తూరు పట్టణంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభకు విచ్చేసిన వారికోసం సుమారు లక్ష మందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయించారు ప్రభాస్. బంధువులకు,  అభిమానులకు, గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక లక్ష మందికి 25 రకాల వంటకాలతో భోజన వసతిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫుడ్ మెన్యూ, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు..

1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల సందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, ఇవి కాక  మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలు. 2 లక్షల బూరెలు, ఇంకా వెజ్ వంటకాలు ఇవి కృష్ణంరాజు సంస్మరణ సభలో వచ్చిన అతిధులకు వడ్డించిన ఆహారం. ఈ వంటకాల కోసం ప్రభాస్ రూ.4 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కృష్ణంరాజు అంతిమ సంస్కారాలకు సంబంధించి తరలివచ్చిన అభిమానులకు కూడా ప్రభాస్ అంత వేదనలో ఉండి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం తెలిసిందే..!!

court issues arrest warrant against producer Ekta Kapoor!

RAJA BABU: COMEDY KING, REAL LIFE philanthropist!