in

Nithya Menen reveals she was harassed by a stalker fan!

సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి తనను వేధించినట్లు తెలిపింది నిత్యా. సంతోష్ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేశాడని.. ఆరేళ్లపాటు తనను అన్‌పాపుల‌ర్ చేయడానికి ప్రయత్నించాడని నిత్యామీనన్ తెలిపింది. దాదాపు 30 వేర్వేరు నెంబర్స్ నుంచి ఫోన్లు చేస్తూ వేధించేవాడని.. అన్ని నెంబర్స్ ను బ్లాక్ చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన పేరెంట్స్ అండగా నిలబడ్డారని.. అతడిని గట్టిగా హెచ్చరించామని తెలిపింది. చాలా మంది అతడిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినట్లు.. కానీ క్షమించి వదిలేశానని చెప్పుకొచ్చింది.

ఈ మధ్యకాలంలో నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఓ మలయాళ హీరోతో ఆమె పెళ్లి జరగనుందని వార్తలొచ్చాయి. వీటిపై నిత్యామీనన్ క్లారిటీ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఇప్పట్లో తనకు పెళ్లి ఆలోచన లేదని వెల్లడించింది. ఎవరో ఒకరు ఇలాంటి పుకారు సృష్టిస్తే.. మీడియా నిజం తెలుసుకోకుండా వార్తలు ప్రచురించిందంటూ చెప్పుకొచ్చింది నిత్యా. తన కెరీర్ లో గ్యాప్స్ తీసుకుంటూ ఉంటానని.. నటులకు ఇలాంటి బ్రేక్స్ అవసరమని.. అంతేకానీ పెళ్లి కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదని తెలిపింది. ఇప్పటికే ఐదు ప్రాజెక్ట్స్ పూర్తి చేశానని.. త్వరలోనే అవి రిలీజ్ కాబోతున్నాయని చెప్పింది. .

Malashree’s daughter to make her debut with Darshan!

lady superstar nayanthara creates a sensational record!