in

nithin confirms his next with allu arjun’s director vamshi!

ఏడాది ప్రారంభంలో చెక్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న నితిన్ ఆ తరువాత ‘రంగ్ దే’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ మాస్ట్రో, అంధాదున్ తెలుగు రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రచయిత నుంచి దర్శకుడిగా మారిన ప్రముఖ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ తరువాత మూవీ ఉండబోతోందని సమాచారం.

అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ ఆ చిత్రంతో భారీ పరాజయాన్ని చవి చూశాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ దర్శకుడు తాజాగా నితిన్ కు స్క్రిప్ట్ ను వివరించాడట. అంతేకాదు వంశీ ఈ చిత్రంతో హిట్ ను కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడట. కరోనా తగ్గిన తరువాత ఈ ఏడాది చివర్లో నితిన్ – వక్కంతం వంశీ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది..

Thank You Brother!

Radhe Shyam team donates movie set property to Covid patients!