in

nidhi agarwal opens up on telugu movies and ott offers!

టీటీ అవకాశాలు వచ్చినా సినిమాకే నా మొదటి ప్రాధాన్యం’ అంటున్నది నాయిక నిధి అగర్వాల్‌. ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకొచ్చిన ఈ భామ…‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో విజయాన్ని అందుకుని క్రేజ్‌ తెచ్చుకుంది. తెలుగమ్మాయిని కాబట్టే మిగతా ఏ భాషల్లో నటించినా టాలీవుడ్‌లో నాయికగా ఉండటం సంతోషాన్నిస్తుందని చెబుతుంటుంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ సరసన ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నదీ తార. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ…‘ఓటీటీలో నాకెన్నో అవకాశాలు వస్తుంటాయి కానీ నాయికగా నా తొలి ప్రాధాన్యం సినిమానే.

ఇతర భాషలకన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో నాయికగా ఉండటమే సంతోషాన్నిస్తుంటుంది. తెలుగమ్మాయిని కావడమే అందుకు కారణం అనుకుంటా. ప్రతి సినిమా ఏదో కొత్త విషయాన్ని నేర్పిస్తుంటుంది. షూటింగ్‌లతో సరదాగా గడుపుతుంటా లేదంటే మా ఫ్యామిలీ బిజినెస్‌ చూసుకుంటా. పెద్ద హీరోలతోనే నటించాలని లేదు. కొన్ని సినిమాలు నాకు గ్లామర్‌ తారగా పేరు తీసుకొచ్చాయి. అయితే డీగ్లామర్‌ క్యారెక్టర్‌లలో కనిపించడానికీ సిద్ధమే’ అని చెప్పింది. ప్రస్తుతం నిధి అగర్వాల్‌ పవన్‌ ‘హరి హర వీరమల్లు’తో పాటు తమిళంలో ఓ సినిమా, హిందీలో మరో చిత్రంలో నటిస్తున్నది..

Pooja Hegde shares her bad experience with Indigo official!

actress Anushka Shetty’s brother alleges death threats!