in

netizens troll pooja hegde for siima 2022 best heroine award!

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా ఆమె ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక డిజాస్టర్ మూటగట్టుకుంది. ఎఫ్3 సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కూడా ఆమె మెరిసింది. అయితే పూజా హెగ్డే కి తాజాగా సైమా అవార్డు లభించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి గాను బెస్ట్ హీరోయిన్ అవార్డు దక్కించుకుంది.

అయితే ఈ నేపథ్యంలో ఆమెను సాయి పల్లవి ఫ్యాన్స్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో ఆమె నటించిన పాత్ర అంత ఛాలెంజింగ్ పాత్ర ఏమీ కాదు. ఒక సాధారణ మోడ్రన్ అమ్మాయి పాత్రలో పూజా హెగ్డే నటించింది. అలాంటి సినిమాకి సైమా అవార్డులలో నామినేషన్ లభించింది. కానీ మా సాయి పల్లవి నటించిన శ్యాం సింగరాయ్ సినిమా ఎందుకు నామినేషన్లలో లేదు అని వారు ప్రశ్నిస్తున్నారు.

పూజా హెగ్డే లాంటివారు డబ్బులు ఇచ్చే ఈ అవార్డులలో నామినేషన్స్ తెప్పించుకోవడమే కాక అవార్డులు కూడా కొనుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ అవార్డు కూడా పూజాకు అలా వచ్చిన అవార్డే అని వారు ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవానికి సైమా అనేది ఒక లాభా పేక్షతో నడిచే వ్యాపార సంస్థ అని, ఎవరికి అవార్డులు ఇస్తే తమకు ఉపయోగం ఉంటుందో అంచనాలు వేసుకుని వారికి అవార్డులు ఇచ్చుకుంటారని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…!!!

Regina cassandra’s Men and Maggie adult joke go viral!

S.V.R VERSUS REBEL STAR!