in

mythri movie makers to repeat uppena combination again!

మొదటి సినిమాతోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరూ పండించిన రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ‘ఉప్పెన’ జోడీ మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందనే ప్రచారం జరుగుతుంది. ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వైష్ణవ్, కృతితో కలిసి మరో సినిమాను చేయబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

అంతేకాదు, ఈ సినిమాతో సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం వైష్ణవ్, కృతి సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌ తన రెండో సినిమా పూర్తిచేసుకొని ఉన్నాడు. ఇక కృతిశెట్టి విషయానికి వస్తే.. శ్యామ్‌ సింగరాయ్‌’ తో పాటు సుధీర్‌బాబు- మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, రామ్‌ హీరోగా లింగుసామి దర్శకత్వంలో కృతిశెట్టి  నటించనుంది.

allari naresh ‘Blade Babji’ title venuka unna story!

wink girl Priya Prakash varrier learning Telugu for audience!