in

LOVE AFFAIRS OF OUR STARS!

మూడు ప్రేమలు ఆరు బ్రేకప్‌లు చెప్పిన జంటలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. యువ హీరోల నుంచి మొదలు పెడితే సీనియర్ నీటీనటులు వరకు చాలా మందే ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇలాంటి జంటలు ఎందరో ఉన్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అయినా తన ఓన్ టాలెంట్‌తోటి నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు. రెజీనా కసాండ్రా, సాయితేజ్‌కి మధ్య ఎఫైర్ నడిచిందని ఇతని కారణంగానే రెజనా కెరియర్ అటకెక్కిందని వార్తలు కూడా వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన తేజ్ కేవలం ఆమె ఫ్రెండ్ మాత్రమే అని తేల్చి చెప్పేశారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య బ్రేకప్ నడుస్తుందని తెలుస్తుంది. ఆర్తిఅగర్వాల్ తరుణ్ ఇష్యూ కూడా ఇలానే నడిచింది. తరుణ్‌తో ఆమె గర్భం దాల్చిందని ఈ కారణంగానే ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గాయని అప్పుడు అందరూ మాట్లాడుకున్నారు. కానీ తెరమీద విత్ కెమిస్ట్రీ కనిపించడానికి హీరో హీరోయిన్లు తెర బయట ఫిజిక్స్ అప్లై చెయ్యడం అందరికి తెలిసిందే. కొందరు ఏదో సైన్స్ గా ఇది ఇండస్ట్రీలో ఉన్న ఆచారం అని అంటుంటారు.

యువ హీరోలు ఓవర్ ఎగ్జైట్ అయి ప్రేమాయణాలు నడిపేస్తుంటారు. విశాల్ వరలక్ష్మి గురించి కూడా ఇలానే చెప్పుకుంటుంటారు. విశాల్ కోలీవుడ్‌లో సూపర్ హీరో. అయితే విశాల్ వరలక్ష్మి శరత్‌కుమార్‌ల మధ్య ప్రేమ కుదిరింది. ఈ ప్రేమ శరత్‌కుమార్, రాధికల మధ్య వైరం తెచ్చిపెట్టింది. వరలక్ష్మి ఇంట్లో విశాల్‌కు గ్రీన్ సిగ్నల్ పడకపోవడంతో ఇది మరో మలుపు తీసుకుంది. నడిగర్ సంఘం ఎన్నికల విశాఖ శరత్ కుమార్‌కి వ్యతిరేకంగా పని చేసి ఓడించాడు కూడా. రాధికశరత్‌కుమార్ తనను వద్దన్నందుకు కసికొద్ది ఎన్నో మంచి చిత్రాల్లో చేస్తూ సామాజికంగా ఎంతో సాయం చేస్తూ పేరు సాధిస్తున్నాడు విశాల్‌. వరలక్ష్మి కూడా విశాల్‌తో బ్రేకప్ అయ్యాక కుప్పలు తెప్పలుగా సినిమాలు చేస్తూ వెళుతుంది. తర్వాత అఖిల్ వర్సెస్ శ్రియ భోపాల్ ఎంగేజ్ మెంట్ కూడా జరిగి ఆగిపోయింది. నాగార్జున కుటుంబంలో జరగాల్సిన పెళ్ళి ఆగిపోవడం ఇదే మొదటిసారేమో. వికశించాల్సిన ప్రేమ వికశించకుండా మధ్యలోనే వాడిపోయింది ఇదే. ఇగో ప్రాబ్లమ్స్ వల్లే ఈ పెళ్ళి వివాహం వరకు వెళ్ళలేదు. ఎయిర్‌పోర్ట్‌లో ఏదో ఒక చిన్న క్లాష్ వచ్చి వారిద్దరు విడిపోయారు అంటారు. అప్పట్లో అఖిల్ పెళ్ళికోసం నాగార్జున భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక తమిళ స్టార్ హీరో శింబు సంగతి సరేసరి ఎందరితో అతను రిలేషన్ మెయిన్‌టెయిన్ చేసి అతను కటీఫ్ చెప్పాడో అతనికైనా తెలుసో లేదో. కాకపోతే నయనతారతో కొంచం ఎక్కువ ఫోకస్ అయింది. అలాగని నయన తార కూడా ఏమీ తక్కువ తినలేదు. శింబో వివాహం అనుకునే సరికి ప్రభుదేవాకి పడిపోయింది. ఈమె కారణంగా ప్రభుదేవ తన భార్యా పిల్లలను సైతం వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత ఏమైందో గాని పీటలెక్కాల్సిన పెళ్ళిఫట్‌మనింది. ఇప్పుడు తమిళ దర్శకుడుతో మళ్ళీ ప్రేమాయణం సాగిస్తోంది. అంజలి జర్నీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈమెకు ఆ చిత్రంలోని హీరో జయ్‌తో ఎఫైర్ కుదిరింది. కారణం ఆమె సన్నపడటానికి ట్రై చేస్తున్న అంజలిని అది నచ్చక వదిలించుకున్నాడని టాక్‌. ఇండస్ట్రీలో బ్రేకప్ అనేది ఓ ఫ్యాషన్‌.

HE IS THE REASON BEHIND ALL MY FAILURES : SWETHA BASU

TESTING TIMES FOR DUSKY BEAUTY!