in

kiara advani is back to tollywood!

ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వరసగా అవకాశాలు అందుకుంటున్న బ్యూటి కియారా అద్వాని. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కాంచన రీమేక్ లక్ష్మీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఈ సినిమా కియారా డెబ్యూ సినిమా కాగా మొదటి సినిమాతోనే టాలీవుడ్ మేకర్స్ దృష్ఠిని ఆకట్టుకుంది. దాంతో వెంటనే మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో మళ్ళీ కియారా తెలుగు సినిమా చేయలేదు.

కాగా తాజా సమాచారం ప్రకారం కియారా ఒక తెలుగు సినిమా ఒప్పుకుందని సమాచారం. అది కూడా కొరటాల శివ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న పాన్ ఇండియన్ సినిమా అని తెలుస్తుంది. కియారా ని కొరటాల నే టాలీవుడ్ కి పరిచయం చేశాడు కాబట్టి ఆయన అడగగానే ఒప్పుకుందని చెపుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి కూడా ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటికి డేట్స్ కూడా సర్దుబాటు చేస్తుందట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియనప్పటికి ఇప్పుడు ఈ న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.

AISHWARYA RAJESH TO REPLACE NIVETHA PETHURAJ!

nani to play director role in his next!