in

AISHWARYA RAJESH TO REPLACE NIVETHA PETHURAJ!

మెగా హీరో సాయి తేజ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలతో హిట్ ట్రాక్‌లో ఉన్న ఆయన కొత్త చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటరు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదలయ్యే లోపే కొత్త సినిమాను మొదలుపెటాడాయన. ఈ చిత్రాన్ని దేవ కట్ట డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. మొదట ఈ చిత్రంలో తేజ్ సరసం నివేత పేతురాజ్‌ను కథానాయకిగా అనుకున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘చిత్రలహరి’లో నటించి అలరించారు. అందుకే వీరిద్దరినీ ఫైనల్ చేశారు. కానీ చివరలో నివేత స్థానంలో ఐశ్వర్య రాజేష్‌ను తీసుకున్నారు. ఈ మార్పు వెనుక కారణాలు తెలియలేదు కానీ మార్పు మాత్రం జరిగిందని తెలిసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని దేవ కట్ట యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

GUNDU KOTTINCHUKONI COLLEGE KU VELLINA NITHYA MENON!

kiara advani is back to tollywood!