in

Disha patani confirmed for Bellamkonda’s Bollywood debut!

టాలీవుడ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో బెల్లం కొండ బాలీవుడ్ కి వెళ్లబోతునట్టు చెబుతున్నారు. అయితే ఇటీవలే టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యిన ఛత్రపతి సినిమా కథతో వెళ్లబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో బాలీవుడ్ లో రిస్క్ చేయకుండా బెల్లంకొండ పాత కథతోనే వెళుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా కాలం నుండి వేట కొనసాగుతుంది.

బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోయిన్ లను సంప్రదించగా వాళ్ళు నో చెప్పినట్టు గుసగుసలు వినిపించాయి. వారిలో జాహ్నవి కపూర్, అనన్య పాండే, శ్రద్ధా కపూర్ లు ఉన్నారు. ఇక ఈ సినిమా కు తాజాగా క్రేజీ హీరోయిన్ దిశా పఠాని ఒకే చెపినట్టు సమాచారం. దిశా పటాని వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. కానీ ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలివుడ్ కు మకాం మార్చింది. అక్కడ మాత్రం ఈ భామ జోరు మాములుగా లేదు. దాంతో బెల్లంకొండ కూడా దిశా ను లైన్ లో పెట్టాడు.

anchor srimukhi gives clarity on her marriage!

Shriya Saran has a narrow escape from a Camel attack!