in

Chiranjeevi To Produce Nagarjuna-Akhil multi starrer Movie?

మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన “లూసిఫర్” అనే సినిమాకి తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్” తో బిజీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మోహన్ రాజా ఇప్పుడు చిరంజీవికి ఒక మల్టీస్టారర్ కథను నేరేట్ చేశారట. చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఈ సినిమా చేస్తే బాగుంటుందని మోహన్ రాజా అభిప్రాయం. అయితే కథ విన్న మెగాస్టార్ తమకంటే నాగార్జున మరియు అఖిల్ సినిమాకి బాగా సెట్ అవుతారని డైరెక్టర్ తో చెప్పారట. సినిమాలో స్టైలిష్ లుక్స్ ఉండటం ముఖ్యమని నాగార్జున అఖిల్ కాంబో అందులో బాగా వర్క్ అవుట్ అవుతుందని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది..

మరోవైపు చిరంజీవి – చరణ్ కలిసి నటించిన “ఆచార్య” సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోవడంతో నాగార్జున అఖిల్ ను సంప్రదించమని చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని స్వయంగా నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఈ సినిమాకి సహా నిర్మాతలుగా వ్యవహరించే అవకాశం ఉంది. మరి మోహన్ రాజా అఖిల్, నాగ్ ను తన మల్టీ స్టారర్ కథ తో ఎంత వరకు మప్పిస్తారో చూడాలి..!!

Venu Thottempudi offered a key role in mahesh babu’s next?

SAVITRI GARIKI NO CHEPPINA N.T.R