in

chiranjeevi and shriya reunites after 20 years!

2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా నటించింది. వయసు పెరుగుతున్నా తన అందాన్ని కాపాడుకుంటూ రెండు దశాబ్దాలుగా నటన కొనసాగిస్తున్న శ్రియ ఇప్పుడు మరోసారి చిరుతో స్టెప్పులు వేయనుంది. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తీస్తున్న ‘భోళా శంకర్‌‌’ చిత్రంలోని ఐటం సాంగ్ కోసం శ్రియను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.  చాలా మందిని సంప్రదించిన తర్వాత చిరుతో పోటాపోటీగా నర్తించేది శ్రియనే అని చిత్ర బృందం నిర్ణయానికి వచ్చిందని వినికిడి. ఈ ఆఫర్ కు వెంటనే ఒప్పుకున్న శ్రియ చిరుతో కాలు కదపడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. పలు చిత్రాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియతో మెగాస్టార్ తో స్పెషల్ నంబర్ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. ఈ పాట కోసం శ్రియా రూ. కోటి పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది..!!

after ntr jhanvi kapoor to star opposite ram charan?

Superstar Rajinikanth in talks with top female director?