
రామ్ పోతినేని, క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు తాజాగా మరింత బలం చేకూరింది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా షూటింగ్ సమయం నుంచే వీరిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ నెట్టింట గట్టిగా ప్రచారం సాగుతోంది. ఈ లవ్ రూమర్స్పై ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా స్పందించనప్పటికీ..తాజాగా భాగ్యశ్రీ బోర్సే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారాయి..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ బోర్సే తన మనసులోని మాటను బయటపెట్టారు. నా మొదటి ఇల్లు ఔరంగాబాద్ అయినప్పటికీ..హైదరాబాద్తో నాకు ఎంతో స్పెషల్ బాండింగ్ ఏర్పడింది. ఇప్పటికే నాకు ఇక్కడ ఒక సొంత ఇల్లు కూడా ఉంది అని వెల్లడించారు. భాగ్యశ్రీ భాగ్యనగరంలో ఇల్లు తీసుకున్న విషయం చెప్పగానే పక్కనే ఉన్న స్టార్ యాంకర్ సుమ ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. భాగ్యశ్రీ ఇల్లు కొన్న విషయం వైరల్ అవ్వడమే ఆలస్యం..నెటిజన్లు దీనికి రామ్ పోతినేని లవ్ ట్రాక్ను ముడిపెడుతున్నారు. రామ్కు దగ్గరగా ఉండటం కోసమే భాగ్యశ్రీ ముంబై, ఔరంగాబాద్లను వదిలి హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని చూస్తోందని..!!
