
నటి కయాదు లోహర్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. శరీరానికి విశ్రాంతి ఇచ్చినట్లే మనసుకు కూడా విశ్రాంతి అవసరమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా కొంతకాలం విశ్రాంతి తీసుకుని, స్క్రీన్కు అవతల ఉన్న నిజ జీవితంతో మమేకం కావాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. “సోషల్ మీడియా నుంచి చిన్న అడుగు వెనక్కి వేస్తున్నాను. కొన్నిసార్లు మనం శరీరానికి ఇచ్చే విశ్రాంతి మనసుకు కూడా అవసరం. నేను కాస్త నెమ్మదించి, డిస్కనెక్ట్ అవ్వాలని, స్క్రీన్కు అవతల ఉన్న జీవితంతో, నాతో నేను ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నాను” అని ఆమె తన పోస్ట్లో రాశారు..!!

